చంద్రబాబును ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా ఆయనకు తగిలించిన బిరుదులివి: విజయసాయిరెడ్డి

  • కింద జాకీలు, పైన క్రేన్లతో బాబును ఎల్లో మీడియా ఆకాశానికెత్తింది
  • చాణక్యుడు, వ్యూహకర్త అని బిరుదులిచ్చింది
  • ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ అని చెప్పింది
  • మరి సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేకపోయారేంటీ? 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా బాబు గారికి తగిలించిన బిరుదులివి. చాణక్యుడు, వ్యూహకర్త, దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు, 20-30 ఏళ్ల ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ. మరి సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి? ఏమిటీ పరాభవం?' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
 
కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 'కరోనా కష్ట కాలంలోనూ మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్నారు యువ ముఖ్యమంత్రి. 80 వేలకు పైగా నేతన్నల కుటుంబాలకు లబ్ది. జగన్ గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రారంభం. ఆర్నెల్లు ముందుగానే నేతన్నల ఖాతాల్లో డబ్బు జమ. మాటల్లో కాదు, చేతల్లో నిజమైన బడుగుల పార్టీ వైసీపీ' అని చెప్పుకొచ్చారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News